''బాబు బంగారం'' సినిమా ప్రమోషన్కు నయనతార దూరంగా ఉంటుందా.. కారణం ఏమిటి?
ఎప్పటినుండో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెంకీ చిత్రం ''బాబు బంగారం'' ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో వెంకీ సరసన మళయాళీ ముద్దుగుమ్మ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలావుంటే... గత కొన్
ఎప్పటినుండో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెంకీ చిత్రం ''బాబు బంగారం'' ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో వెంకీ సరసన మళయాళీ ముద్దుగుమ్మ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలావుంటే... గత కొన్ని రోజులుగా వివాదాలతోనే నయనతార ఎక్కువగా గడుపుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ హీరోయిన్ 'బాబు బంగారం' యూనిట్తో గొడవపడిందన్న వార్తలు టాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతున్నాయి. అయితే యూనిట్ సభ్యులు అలాంటిదేమి లేదని మొదట్లో కొట్టి పారేసినా.. గుసగుసలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి.
తాజాగా మరోసారి ఇలాంటి వార్తే ఫిలింనగర్లో చక్కెర్లు వినిపిస్తోంది. అదేంటంటే... ఈ సినిమా ప్రమోషన్ ఓ మోస్తరుగా సాగుతోంది. హీరో వెంకటేష్ మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. కానీ, హీరోయిన్ మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. సినిమా నటించిన తరువాత ఆ సినిమాకు తనకు సంబంధంలేనట్టుంటుంది నయన వ్యవహారం.
వెంకటేష్ లాంటి స్టార్ హీరో కూడా స్పెషల్ ఇంటర్వూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తుంటే, నయనతార మాత్రం వాటికి కాస్త దూరంగానే ఉంది. కానీ, నయనతార మాత్రం ప్రమోషన్ సంగతి తనకు అనవసరం.. అన్నట్లుగా వ్యవహరిస్తోంది. దర్శకుడు మారుతితో వచ్చిన విభేదాల కారణంగానే నయనతార, సినిమా ప్రమోషన్కి దూరంగా వుంటోందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.