Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయలలిత పాత్రలో త్రిష.. మేమిద్దరం ఒకే స్కూల్‌లో చదువుకున్నాం...

నటుడు ధనుష్ నటించిన తాజా చిత్రం 'కొడి'. ఆయన తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌లు నాయికలుగా నటించారు. దర్శకుడు వెట్ట్రిమారన్ గ్రాస్ రూట్ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత

జయలలిత పాత్రలో త్రిష.. మేమిద్దరం ఒకే స్కూల్‌లో చదువుకున్నాం...
, శుక్రవారం, 28 అక్టోబరు 2016 (09:31 IST)
నటుడు ధనుష్ నటించిన తాజా చిత్రం 'కొడి'. ఆయన తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌లు నాయికలుగా నటించారు. దర్శకుడు వెట్ట్రిమారన్ గ్రాస్ రూట్ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఇంతకు ముందు ఎదిర్‌నీశ్చల్, కాక్కీసట్టై వంటి విజయవంతమైన చిత్రాల ఫేమ్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు. సంతోష నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ సర్టిఫికెట్‌తో దీపావళి పండగను పురస్కరించుకుని ఈ నెల 28న విడుదల కానుంది. 
 
కాగా ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న సందర్భంగా త్రిష సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం బయోగ్రఫీల హవా నడుస్తోందని, బాలీవుడ్‌లో పలువురు క్రీడా ప్రముఖుల జీవిత చరిత్రలు సినిమాలుగా వచ్చి సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో తనకు ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించాలని ఉందని చెప్పింది. 
 
తామిద్దరం ఒకే స్కూల్ (చర్చ్ పార్క్)లో చదువుకున్నామని గుర్తుచేసింది. జయలలిత జీవితం స్ఫూర్తివంతంగా ఉంటుందని, ఆమె పాత్రలో నటించడం ద్వారా ముఖ్యమంత్రిగా కనిపించవచ్చని తెలిపింది. అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోనని త్రిష తెలిపింది. సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లైనా టాప్ హీరోయిన్‌గానే చెలామణి అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేమిద్దరం రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నాం.. త్వరలో పిల్లలుకంటా : అలియా భట్