Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ఆప్తమిత్రుడు' కోసం పెన్ను- పేపర్ పడుతానంటున్న 'మాటల మాంత్రికుడు' (Video)

'ఆప్తమిత్రుడు' కోసం పెన్ను- పేపర్ పడుతానంటున్న 'మాటల మాంత్రికుడు' (Video)
, బుధవారం, 9 సెప్టెంబరు 2020 (09:45 IST)
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మంచి మిత్రులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో 'అజ్ఞాతవాసి' మినహా మిగిలిన రెండు చిత్రాలు (జల్సా, అత్తారింటికి దారేది) సూపర్ డూపర్ హిట్స్ సాధించాయి. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం వస్తుందంటే.. పీకే ఫ్యాన్స్ ఆనందానికి అవధులే వుండవు. 
 
ఈ క్రమంలో ఇటీవల 50వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న పవన్ కళ్యాణ్ వరుసగా మూడు ప్రాజెక్టులను ప్రకటించారు. తాజాగా ప‌వ‌న్‌కు సంబంధించిన మ‌రో హాట్ న్యూస్ ఫిల్మ్ న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప‌వ‌న్ కోసం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మ‌రోసారి పెన్ను, పేప‌ర్ పట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. 
 
త‌మిళంలో హిట్‌గా నిలిచిన 'అయ్య‌ప్ప‌నుమ్ కొషియ‌మ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జ‌రుగుతున్నాయి. అయితే హీరోల విష‌యంలో సందిగ్ధ‌త నెల‌కొన‌డంతో ప‌వ‌న్ పేరును ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేస్తే బాగుంటుంద‌ని వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది.
 
ఒక‌వేళ ప‌వ‌న్ ఈ చిత్రంలో న‌టించేది క‌న్ఫామ్ అయితే త్రివిక్ర‌మ్ రీమేక్ చిత్రానికి సంభాష‌ణ‌లు రాసేందుకు రెడీగా ఉన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం చేతినిండా స‌మ‌యముండ‌టంతో డైలాగ్స్ రాస్తాన‌ని త్రివిక్ర‌మ్ చెప్పినట్టు సమాచారం. గతంలో కూడా పవన్ నటించిన తీన్మార్ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ అందించిన విషయం తెల్సిందే. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీకు దండం నాయ‌నా.. వ‌దిన ఏంటీ.. అక్క అనండి.. పీకే ఫ్యాన్స్‌కు వేడుకోలు