Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లు అర్జున్ అంత పని చేశాడా...? పరువు పోయిందా..? ఏం జరిగింది...?

మెగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పరువు పోయిందా...? ప్రతి సంవత్సరం జరిగే సైమా అవార్డు వేడుకలకు ఈసారి కూడా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పలువురు స్టార్‌ హీరోలకు ఈ అవార్డుల్లో ఉత్తమ హీరోగా ఎంట్రీ దక్కింది. ఇక సైమా నిర్వాహకులు ఉత్తమ నటుడి ఎంపిక

Advertiesment
SIIMA Awards
, మంగళవారం, 31 మే 2016 (14:29 IST)
మెగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పరువు పోయిందా...? ప్రతి సంవత్సరం జరిగే సైమా అవార్డు వేడుకలకు ఈసారి కూడా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పలువురు స్టార్‌ హీరోలకు ఈ అవార్డుల్లో ఉత్తమ హీరోగా ఎంట్రీ దక్కింది. ఇక సైమా నిర్వాహకులు ఉత్తమ నటుడి ఎంపికను ప్రేక్షకులకు వదిలేశారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఉత్తమ హీరో అయ్యే అవకాశం ఉంటుంది. మహేష్‌ బాబు ‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’, ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రాలతో ముందు వరుసలో ఉన్నారు. 
 
అయితే అనూహ్యంగా ఒకే రోజు 30 వేలకు పైగా ఓట్లు రావడంతో అల్లు అర్జున్‌ అందరు హీరోలను దాటేసి ముందుకు వెళ్లాడు. సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రంలో అల్లు అర్జున్‌ నటనకు ఉత్తమ హీరో అవార్డు ఇవ్వాలంటూ ఓట్లు భారీగా వచ్చాయి. ఒక్కసారిగా 30 వేల ఓట్లు రావడంతో షాక్‌ అయిన నిర్వాహకులు వచ్చిన ఓట్లను పరిశీలించారు. దాంతో ఆ మొత్తం ఓట్లలో 27 వేల ఓట్లు దొంగ ఓట్లు అంటూ తేలింది. 
 
దాంతో నిర్వాహకులు ఆ ఓట్లను తొలగించారు. దీనితో ఇప్పుడు అల్లు అర్జున్‌ జాబితాలో చివరి స్థానంలో ఉన్నాడు. అవార్డు కోసం అల్లు అర్జున్‌ తన వారితో సైమా సైట్‌ను హ్యాక్‌ చేయించి ఆ ఓట్లు పడేలా చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఐతే ఇప్పటి వరకు సైమా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు బన్నీ ఫ్యాన్స్‌ ఈ విషయాన్ని తోసిపుచ్చుతున్నారు. కాని విమర్శకులు మాత్రం అల్లు అర్జున్‌ అవార్డు కోసం కక్కుర్తి పని చేశాడని విమర్శిస్తున్నారు. అల్లు అర్జున్ అంత పని చేసి ఉంటారా...? అబ్బే... అలా ఏమీ చేయడని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2వేల ఎపిసోడ్స్‌తో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో బాలికా వధు!