విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో షాహిద్ కపూర్, కంగనా రనౌత్, సైఫ్ ఆలీఖాన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం 'రంగూన్'. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి సాజిద్ నదియా ద్వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ మీసంకట్టులో మెరవటం తక్కువే. తాజాగా సైఫ్ పెన్సిల్తో గీత గీసినట్లుండే స్టైలిష్ మీసంతో ''రంగూన్'' చిత్రంలో నటిస్తున్నారు.
ఇదివరకూ ఈ పటౌడీ కుర్రాడిని ప్రేక్షకులు ఈ లుక్లో చూడలేదంటున్నాడు దర్శకుడు విశాల్భరద్వాజ్. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ కూడా మాస్లుక్లో కనిపిస్తున్నాడట. ప్రస్తుతం కొంతభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న యూనిట్ సభ్యులు ఇప్పుడు మరుసటి షెడ్యూల్ కోసం అరుణాచల్ ప్రదేశ్కి బయలుదేరారు. ఇక్కడకు వెళ్లడానికి మిగతా యూనిట్ ప్యాక్ చేసుకున్నలగేజ్ ఒక ఎత్తయితే.. షాహిద్ ఒక్కడి లగేజ్ మరొక ఎత్తు. ఎందుకో తెలుసా రాధా సోమికి అపర భక్తుడైన షాహిద్ కపూర్.. ఔట్ డోర్స్లో వంటలపై నిరుత్సాహానికి గురయ్యాడట.
రుచి సంగతి అటుంచితే శుభ్రత లేకపోవడంతో తనే వంట చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. దీనికోసం 45 కేజీల బ్రౌన్ రైస్, వీటితోపాటు వంట పాత్రలను కూడా వెంట తీసుకెళ్తున్నాడు. ఏకంగా 19 సూట్ కేసులు ప్లస్ బ్యాగేజ్తో రెడీ అయ్యాడట షాహిద్ కపూర్. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో తనకోసం ప్రత్యేకంగా ఏసీ ఏర్పాట్లు ఉండాలని చెప్పడంతో యూనిట్ సభ్యులు నివ్వెరపోయారట. అక్కడ ఇప్పటికే 16 డిగ్రీల చలి ఉంటే అలాంటి పరిస్థితిలోనూ ఏసీ కావాలని చెప్పడంతో.. రంగూన్ యూనిట్కి చుక్కలు కనిపించాయట.