Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్‌కు విలన్లుగా మారనున్న కరీనా, సైఫ్ అలీఖాన్..?!

Advertiesment
kareena kapoor

సెల్వి

, శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (10:17 IST)
చిత్రనిర్మాత సందీప్ రెడ్డి వంగా తన రాబోయే చిత్రం స్పిరిట్‌తో ప్రభాస్‌తో కలిసి పనిచేస్తున్నాడు. యానిమల్ భారీ విజయాన్ని అనుసరించి, స్పిరిట్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా తారాగణంపై భారీగా దృష్టి పెట్టారు వంగా. 
 
ముఖ్యంగా ఈ సినిమాలో విలన్‌లుగా సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్‌లను ఎంపిక చేయడం నిజంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇది కనుక నిజమైతే, రియల్ జంట తెరపై విలన్‌గా కనిపించే అవకాశం వుంది. ఇలా నిజజీవితంలోని భార్యాభర్తలను తెరపై విలన్‌గా చిత్రీకరించే అరుదైన సినిమాగా స్పిరిట్ అవుతుంది. 
 
"స్పిరిట్" చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తాడట. పవర్‌ఫుల్ మాఫియా డాన్‌గా వయోలెంట్ క్యారెక్టర్‌లో ప్రభాస్ కనిపిస్తాడట. ‘స్పిరిట్’ సినిమాలో వారిద్దరి కోసం అనుకుంటున్న క్యారెక్టర్స్ ను దర్శకుడు పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని సమాచారం. ఇక ఈ ఏడాది చివరలో పూర్తి నటీనటులను ఫైనల్ చేసి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రగ్స్ కేసుల్లో ప్రమేయం.. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" ఫేమ్ అభిషేక్ అరెస్ట్