Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంజుల దర్శకత్వంలో.. సాయి పల్లవి

మహేశ్‌ బాబు సోదరి మంజుల.. నటిగా.. నిర్మాతగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. గతంలో 'షో' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. తాజాగా మరో ప్రయత్నం చేస్తుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా ఆమె సందీప్‌ కిషన్‌ను ఎంచు

మంజుల దర్శకత్వంలో.. సాయి పల్లవి
, శుక్రవారం, 13 జనవరి 2017 (10:58 IST)
మహేశ్‌ బాబు సోదరి మంజుల.. నటిగా.. నిర్మాతగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. గతంలో 'షో' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. తాజాగా మరో ప్రయత్నం చేస్తుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా ఆమె సందీప్‌ కిషన్‌ను ఎంచుకుంది. ఈ సినిమాలో కథానాయిక కోసం కొంతమంది పేర్లను పరిశీలించి, చివరికి సాయి పల్లవిని ఎంపిక చేసినట్టు సమాచారం.
 
మలయాళ 'ప్రేమమ్‌'లో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మాయి, ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల 'ఫిదా' చిత్రంలో నటిస్తోంది. మంజుల  సినిమా కోసం సందీప్‌ కిషన్‌ కొత్త లుక్‌ కోసం ట్రై చేస్తున్నాడట. ప్రస్తుతం చేస్తోన్న 'నక్షత్రం' పూర్తి కాగానే, ఆయన ఈ సినిమా సెట్స్‌‌పైకి రానున్నాడు. జెమిని కిరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, ఫిబ్రవరిలో రెగ్యులర్‌ షూటింగును ఆరంభించనుంది.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఖైదీ' బ్లాక్‌బస్టర్ హిట్‌తో చిరంజీవి తదుపరి చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'