Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫుల్లు టెన్షన్ పడుతున్న సాయిధరమ్ తేజ్

సాయిధ‌ర‌మ్ తేజ్‌కి వ‌రుస ఫ్లాప్స్ వ‌స్తుండ‌టంతో బ‌డా డైరెక్ట‌ర్స్‌ని న‌మ్ముకున్నాడు. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్‌తో ఇంటిలిజెంట్ సినిమా చేసాడు. కానీ.. స‌క్స‌స్ కాలేదు. ఆత‌ర్వాత క‌రుణాక‌ర‌న్‌తో తేజ్ అనే సినిమా చేసాడు. ఈ సినిమా కూడా తేజ్‌ని ఆదుకోలేక‌పో

Advertiesment
Sai dhram Tej
, శుక్రవారం, 13 జులై 2018 (22:01 IST)
సాయిధ‌ర‌మ్ తేజ్‌కి వ‌రుస ఫ్లాప్స్ వ‌స్తుండ‌టంతో బ‌డా డైరెక్ట‌ర్స్‌ని న‌మ్ముకున్నాడు. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్‌తో ఇంటిలిజెంట్ సినిమా చేసాడు. కానీ.. స‌క్స‌స్ కాలేదు. ఆత‌ర్వాత క‌రుణాక‌ర‌న్‌తో తేజ్ అనే సినిమా చేసాడు. ఈ సినిమా కూడా తేజ్‌ని ఆదుకోలేక‌పోయింది. దీంతో బాగా టెన్షన్ ప‌డుతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ మెగా హీరో కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.
 
అయితే.. తేజ్ - గోపీచంద్ మ‌లినేని క‌లిసి విన్న‌ర్ సినిమా చేసారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో వీరిద్ద‌రూ మ‌ళ్లీ సినిమా చేయాల‌నుకున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా ఉంటుందేమో అనుకున్నారు. కానీ.. తాజాగా తేజ్... గోపాల్ అనే కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన స్ర్కిప్ట్‌కి ఓకే చెప్పాడు. దీనిని ఠాగూర్ మ‌ధు నిర్మించ‌నున్నారు. ఈ సినిమా కోసం భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా అనే టైటిల్ నిర్ణ‌యించారు. త్వ‌ర‌లోనే ఈ మూవీని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ట‌. సో...ఇప్ప‌ట్లో తేజ్ - గోపీచంద్ మూవీ లేన‌ట్లే..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంకీ మామ‌లో మ‌రో హీరోయిన్ ఎవ‌రు..?