Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'గాలి' ఇంట డ్యాన్స్ చేసినందుకు ఎంత ముట్టింది? రకుల్ ప్రీత్ సింగ్‌కు ఐటీ నోటీసు

టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ చిక్కుల్లో పడేలా కనిపిస్తోంది. ఆమెకు ఆదాయపన్ను శాఖ నోటీసు జారీచేసింది. ఇటీవల కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన వి

Advertiesment
Rakul Preet Singh
, మంగళవారం, 22 నవంబరు 2016 (16:33 IST)
టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ చిక్కుల్లో పడేలా కనిపిస్తోంది. ఆమెకు ఆదాయపన్ను శాఖ నోటీసు జారీచేసింది. ఇటీవల కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ వివాహ మహోత్సవానికి దక్షిణాదికి చెందిన రాజకీయ ప్రముఖులతోబాటు సినీ సెలబ్రిటీలకు కూడా హాజరయ్యారు. 
 
ఈ వివాహం కోసం ఏకంగా రూ.500 కోట్ల మేరకు ఖర్చు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆ పెళ్లి వేడుకలో సందడి చేసిన కొంతమంది సెలబ్రిటీలకు భారీగా డబ్బులు అందాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ వేడుకలో డ్యాన్స్‌ చేసిన తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు ఒక్కొక్కరు కోటి రూపాయల మేరకు అందుకున్నట్టు వినికిడి. అందుకే ఇప్పుడు రకుల్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.
 
ఇప్పటికే గాలి వారింట పెళ్లిపై కన్నేసిన ఐటీ శాఖ.. ఆ పెళ్లికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తోంది. అలాగే డబ్బు పుచ్చుకున్న వారికి కూడా ఐటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసులు వచ్చాయట. అలా నోటీసులు అందుకున్న వారిలో రకుల్‌ కూడా ఉందని ఫిల్మ్ నగర్‌లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే రకుల్‌ మాత్రం ఆ వార్తలను కొట్టిపారేస్తోంది. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, తను చాలా ప్యూర్‌ అని అంటోంది ఈ ఢిల్లీ బ్యూటీ. మరి, రకుల్‌ ఎంత ప్యూరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవికా గోర్‌‍కు వాట్సాప్ ద్వారా అశ్లీల మెసేజ్‌లు.. ఆ యువ హీరో ఎవరు?