Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్ కోసం దుబాయ్ వెళ్లింది.. అనుష్కకు ప్రామిస్ చేసిన బాహుబలి.. ఎందుకు?

మిర్చి, బాహుబలి సినిమాల్లో జతకట్టి.. హిట్ పెయిర్‌గా పేరు కొట్టేసిన ప్రభాస్- అనుష్క.. మంచి స్నేహితులు. బాహుబలికి తర్వాత ఒక దశలో వీరిద్దరూ ప్రేమలో వున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ

Advertiesment
Baahubali
, మంగళవారం, 22 మే 2018 (12:28 IST)
మిర్చి, బాహుబలి సినిమాల్లో జతకట్టి.. హిట్ పెయిర్‌గా పేరు కొట్టేసిన ప్రభాస్- అనుష్క.. మంచి స్నేహితులు. బాహుబలికి తర్వాత ఒక దశలో వీరిద్దరూ ప్రేమలో వున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ వాటిని వీరిద్దరూ ఖండించారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన కొత్త చిత్రం ''సాహో'' కోసం దుబాయ్‌లో నెల రోజులకు పైగా మకాం వేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ సీన్స్ కోసం.., అవి హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించాలన్న ఉద్దేశంతో రూ. 90 కోట్లతో ఫైట్ సీన్‌ను చిత్రీకరించారని టాక్ వచ్చింది. అంతేగాకుండా ఈ యాక్షన్ సన్నివేశాల్లో రియాల్టీ కోసం ప్రభాస్ డూప్ లేకుండా షూటింగ్ చేశాడని తెలిసింది. 
 
అంతే అనుష్క దుబాయ్‌కి పరుగులు పెట్టింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రభాస్‌‍కు రెండుసార్లు గాయాలు కావడంతో దుబాయ్‌కి వెళ్లిన అనుష్క ప్రభాస్‌కు వార్నింగ్ ఇచ్చిందట. గంట పాటు క్లాజ్ తీసుకున్న అనుష్క డూప్ లేకుండా రిస్కీ షాట్లు చేయొద్దని చెప్పిందట. 
 
ఏదైనా జరిగితే అభిమానులు ఎంతో బాధపడతారని నచ్చజెప్పిందట. రిస్క్‌తో కూడుకున్న షాట్స్‌ను డూప్ సహాయంతోనే పూర్తి చేయాలని కాస్తంత గట్టిగా అనుష్క చెప్పేసరికి, సరేనంటూ తలూపిన ప్రభాస్, డూప్‌ను పెట్టుకుంటానని ప్రామిస్ కూడా చేశాడని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహానటి సినిమాకి కౌంటర్ రాబోతోంది..!