Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''వేదాళం'' స్టోరీపై ఫోకస్ పెట్టిన పవన్...నేసన్ కాంబోలో...

పవన్ ప్రస్తుతం డాలీ డైరెక్షన్‌లో కాటమరాయుడు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుందని అనుకున్నారు. పవన్ త్రివ

''వేదాళం'' స్టోరీపై ఫోకస్ పెట్టిన పవన్...నేసన్ కాంబోలో...
, బుధవారం, 12 అక్టోబరు 2016 (12:12 IST)
పవన్ ప్రస్తుతం డాలీ డైరెక్షన్‌లో కాటమరాయుడు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుందని అనుకున్నారు.  పవన్ త్రివిక్రమ్ సినిమా కంటే ముందుగా జిల్లా డైరెక్టర్ నేసన్‌తో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు (బుధవారం) జరిగాయి.
 
ఈ సినిమా పవన్ కెరీర్లో 23వ చిత్రం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. ఈ సినిమా డైరెక్టర్ నేసన్ గతంలో తమిళ స్టార్ హీరో విజయ్‌తో జిల్లా అనే సినిమాను తెరకెక్కించాడు. అజిత్ హీరోగా ''వేదాళం'' స్టోరీపై పవన్ బాగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, పవన్‌తో సంప్రదింపులు చేస్తున్నాడట. 
 
ఈ రీమేక్‌ను తాను నిర్మిస్తానని ఆయన ముందుకొచ్చినట్టు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు పవన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా స్టోరీలో కాస్త మార్పులు చేర్పులు జరుగుతున్నాయని సినీ వర్గాల సమాచారం. మొత్తానికి ఓవైపు డాలీ, మరోవైపు నేసన్, ఇంకోవైపు త్రివిక్రమ్‌లతో పవన్ బిజీ అన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీఆర్పీ రేటింగ్ కోసం నా మాటల్ని ఎడిట్ చేశారు: సంజన క్లారిటీ