Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను రెండుసార్లు అత్యాచారానికి గురయ్యాను : నటి నిత్యామీనన్

మలయాళ కుట్టి నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ సంచలన వ్యాఖ్యలు ఏంటో తెలుసా.. ఆమె రెండు సార్లు అత్యాచారానికి గురైందట. ఈ మాటలు విన్న ఫిల్మ్ ఇండస్ట్రీ నోట మాటరాలేదు. ఆ తర్వాత ఆ అమ్మడే ఈ రేప్‌పై క్లా

Advertiesment
నేను రెండుసార్లు అత్యాచారానికి గురయ్యాను : నటి నిత్యామీనన్
, బుధవారం, 23 నవంబరు 2016 (14:38 IST)
మలయాళ కుట్టి నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ సంచలన వ్యాఖ్యలు ఏంటో తెలుసా.. ఆమె రెండు సార్లు అత్యాచారానికి గురైందట. ఈ మాటలు విన్న ఫిల్మ్ ఇండస్ట్రీ నోట మాటరాలేదు. ఆ తర్వాత ఆ అమ్మడే ఈ రేప్‌పై క్లారిటీ ఇవ్వడంతో వారంతా తేరుకున్నారు. అత్యాచార వార్తలపై  ఆమె స్పందిస్తూ... 
 
నిజానికి ఈ ముద్దుగుమ్మ... "అలా మొదలైంది" అనే చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ భామ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటోంది. తాజాగా ‘ఘటన’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే.. ఈ అమ్మడు అత్యాచారంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనపై రెండు సార్లు అత్యాచారం జరిగిందని చెప్పుకొచ్చింది. 
 
అయినా సరే తనపై రేప్ జరిగిందన్న విషయమే తనకు తెలియలేదని షాకిచ్చింది. కానీ, తనపై రేప్ జరిగింది నిజ జీవితంలో కాదని, సినిమాలో అని క్లారిటీ ఇచ్చింది. తన తాజా చిత్రం 'ఘటన'లో తాను రెండు సార్లు అత్యాచారానికి గురవుతానని, సినిమాలో విలన్‌గా నటించిన సీనియర్ నటుడు నరేశ్ చేతిలో రెండు సార్లు అత్యాచారానికి గురయ్యే సన్నివేశాలు ఉంటాయని చెప్పింది. ఆ రెండు సన్నివేశాలను సున్నితంగా చిత్రీకరించడంతో.. అది రేప్ అన్న ఫీలింగ్ కలగలేదని వెల్లడించింది. రేప్ సీన్‌లో నటించానన్న ఫీలింగ్ రాలేదని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బాహుబలి 2' హైప్ కోసమే లీకుల తంటాలా...? సినీజనం గుసగుసలు...