Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లికి ముందే ప్రియాంకతో గాఢ ప్రేమలో మునిగిపోయా : ఎంఎస్.ధోనీ

భారత క్రికెట్టు జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితకథను ఆధారంగా చేసుకుని 'ఎం.ఎస్.ధోనీ - ద అన్ టోల్డ్ స్టోరీ' పేరిట నీరజ్ పాండే ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ధోనీ ఫస్ట్ లవ్ గురించి ఎవరిక

పెళ్లికి ముందే ప్రియాంకతో గాఢ ప్రేమలో మునిగిపోయా : ఎంఎస్.ధోనీ
, బుధవారం, 13 జులై 2016 (10:09 IST)
భారత క్రికెట్టు జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితకథను ఆధారంగా చేసుకుని 'ఎం.ఎస్.ధోనీ - ద అన్ టోల్డ్ స్టోరీ' పేరిట నీరజ్ పాండే ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ధోనీ ఫస్ట్ లవ్ గురించి ఎవరికి తెలియని విషయాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.

నిజానికి ధోనీ ప్రేమించింది.. పెళ్లి చేసుకుంది ఒక్క అమ్మాయినే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ధోనీ పెళ్లిచేసుకుంది సాక్షినే అయినా.. తన ప్రేమించింది మాత్రం మరొక అమ్మాయిని. అసలు విషయానికొస్తే... భారత జట్టులోకి అడుగుపెట్టక ముందే ధోని రాంచీకి చెందిన ప్రియాంక ఝా అనే అమ్మాయిని గాఢంగా ప్రేమించాడట. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాడు. 
 
కానీ, దురదృష్టం కొద్దీ, ఓ ప్రమాదంలో ప్రియాంక మరణించింది. అప్పుడప్పుడే క్రికెట్లో ఎదుగుతున్న ధోనిపై ఈ సంఘటన చాలా ప్రభావం చూపిందట. ఈ సంఘటనతో షాక్‌కు గురైన ధోనీ రాంచీలో ఉండలేకపోయాడు. ప్రియాంక మరణించిన ఏడాదిపాటు ఆమెక జ్ఞాపకాలు అతడిని వెంటాడుతూనే ఉన్నాయట. టీమ్ ఇండియాలో చోటు దక్కడంతో ఆ విషాదాన్నిమరిచి ఆటపై పూర్తి శ్రద్ధ పెట్టాడట. 
 
అదేసమయంలో టీమిండియా నుంచి ధోనీకి పిలుపు రావడంతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. తన వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పేందుకు ఎక్కువగా ఇష్టపడని ధోని సినిమా కోసం తన లవ్ స్టోరీని అందరిముందు బయటపెట్టాడు. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షి సింగ్ రావత్‌ను ధోనీ పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఈ విషయం తెలిసిన ధోని భార్య సాక్షి ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బన్నీ స్నేహారెడ్డి చేయి వదలడా? భార్యంటే బన్నీకి ఎంత ప్రేమో..!!