Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"ఆచార్య" విడుదలకు అడ్డుపడుతున్న కరోనా!

, సోమవారం, 12 ఏప్రియల్ 2021 (19:10 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రిలీజ్‌ వాయిదా పడుతుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అవి ఇపుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. 
 
ఆ చిత్రం కోసం మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. పైగా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. దానికి తోడు మొన్న విడుదలైన 'లాహే లాహే' పాట యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. 
 
గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను సాహితీ చాగంటి, హారిక నారాయణ్ పాడారు. ఈ పాటతో పాటు టీజర్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రూ.100 కోట్లకు పైగా జరుగుతుంది. కోవిడ్ తర్వాత తెలుగులో విడుదలవుతున్న భారీ సినిమాల్లో 'ఆచార్య' ముందు వరుసలో ఉంటుంది. 
 
మే 13న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో 'ఆచార్య' సినిమా రిలీజ్‌ వాయిదా వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లవ్ స్టోరీ' కూడా వాయిదాపడిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొలం పనుల్లో బిజీ బీజీగా వున్న కేజీఎఫ్ స్టార్..