Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్త ఇంట్లోకి రానివ్వలేదు.. భర్త 'ఆ' బంధం తెంచుకున్నాడు.. నటి న్యాయ పోరాటం

బాలీవుడ్ నటి ఒకరు రోడ్డున పడ్డారు. 'క్యా కూల్ హై హమ్' చిత్ర నటి, 'బిగ్‌బాస్ 9'లో కంటెస్టెంట్ అయిన మందనా కరీమి. ప్రస్తుతం ఈమె కట్టుకున్న భర్తపై గృహహింస కేసు పెట్టింది. అత్త ఇంట్లోకి రానివ్వడంలేదనీ, భర్

అత్త ఇంట్లోకి రానివ్వలేదు.. భర్త 'ఆ' బంధం తెంచుకున్నాడు.. నటి న్యాయ పోరాటం
, మంగళవారం, 4 జులై 2017 (12:44 IST)
బాలీవుడ్ నటి ఒకరు రోడ్డున పడ్డారు. 'క్యా కూల్ హై హమ్' చిత్ర నటి, 'బిగ్‌బాస్ 9'లో కంటెస్టెంట్ అయిన మందనా కరీమి. ప్రస్తుతం ఈమె కట్టుకున్న భర్తపై గృహహింస కేసు పెట్టింది. అత్త ఇంట్లోకి రానివ్వడంలేదనీ, భర్త వైవాహిక బంధాన్ని తెంచుకున్నాడనీ, ఇపుడు తాను రోడ్డున పడినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... 'ఏడువారాల కిందట మా అత్తవారి ఇంటి నుంచి నన్ను వెళ్లగొట్టారు. వారితో రాజీ చేసుకునేందుకు నేను ఎంతగానో ప్రయత్నించాను. అయినా మా అత్తావాళ్లు నన్ను తిరిగి ఇంట్లోకి రానివ్వలేదు. గౌరవ్‌ కూడా నాతో సంబంధాలు తెంపుకున్నాడు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
 
కాగా, గత జనవరి 25న మందన, గౌరవ్ వివాహం చేసుకున్నారు. ఆరు నెలలు కూడా తిరక్కుండానే వారి మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలో భర్త గౌరవ్ గుప్తాపై 498 (ఏ) (గృహ హింస) కేసు పెట్టింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లవర్ బాయ్ సిద్ధుతో రేష్మి డేటింగ్ నిజమేనా?!!