దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి కాజల్ అగర్వాల్. ''చందమామ'' చిత్రం ద్వారా ప్రేక్షకుల మనసుని కొల్లగొట్టింది. తన నటనతో అగ్రహీరోల సరసన నటించే ఛాన్స్ని కొట్టేసి వరుసవిజయాలతో ముందుకు దూసుకెళుతుంది. ఇప్పటివరకు ఆ ఇమేజ్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన మాత్రమే నటిస్తూ వచ్చిన కాజల్ ఇప్పుడు ఓ అతిధి పాత్రలో కనిపించనుంది. కృష్ణవంశీ తీయబోయే చిత్రంలో గెస్ట్ రోల్లో అందరిని అలరించనుంది.
ప్రస్తుతం కృష్ణవంశీ నక్షత్ర అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాని తెరకెక్కించే పనిలో దర్శకుడు బిజిబిజీగా ఉన్నాడు. ఇందులో గెస్ట్ రోల్కి అయన కాజల్ని సంప్రదించారట. 15 రోజుల కాల్షీట్స్ను కూడా తీసుకున్నాడట.
''చందమామ'' సినిమా ద్వారా తనకి ఈ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన డైరెక్టర్ ఆయనే కాబట్టి, ఆమె ఓకే చెప్పిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. గెస్ట్ రోల్ అయినా పారితోషికం మాత్రం పెద్ద మొత్తంలోనే తీసుకుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.