Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబాయ్‌తో పోటీ వద్దనుకున్న అబ్బాయిలు.. పైసా వసూల్ కోసం.. జై లవకుశ వాయిదా?

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పైసా వసూల్ సినిమా షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతోంది. కొన్ని పాటలను, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా ఫస్

Advertiesment
Jr NTR
, బుధవారం, 28 జూన్ 2017 (10:12 IST)
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పైసా వసూల్ సినిమా షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతోంది. కొన్ని పాటలను, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ డాన్స్ మూమెంట్‌తో కూడిన పోస్టర్, ఫైట్స్ సీన్స్‌తో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం 'పైసా వసూల్' సినిమా సెప్టెంబర్ 29న విడుదల కాబోతోంది. 
 
అయితే ఈ సినిమాకు సరిగ్గా వారం ముందు... అంటే సెప్టెంబర్ 21న జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జై లవకుశ' చిత్రం విడుదల కావాల్సింది. తారక్ అన్న కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలనుకుంటున్నారు. బాబాయ్, అబ్బాయ్‌ల సినిమాలు ఒకే సమయంలో విడుదల కావడం ఎందుకని, బాబాయ్‌తో పోటీ ఎందుకని తారక్, కల్యాణ్ భావించారట. 
 
అంతేగాకుండా.. అభిమానులకు తప్పుడు సంకేతాలను పంపడం ఇష్టంలేక తారక్, కల్యాణ్ రామ్‌లే రాజీపడ్డారని సమాచారం. బాబాయ్ సినిమా కోసం తమ సినిమా విడుదలను వాయిదా వేయాలని తారక్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాతీయ హీరో అనుకుంటే బాలీవుడ్‌లో అతిథి పాత్రా.. ప్రభాస్ ఏమైపోతాడో..