Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జులై 15న జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్?

Advertiesment
Janatha Garage
, సోమవారం, 9 మే 2016 (16:30 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. ''నాన్నకు ప్రేమతో'' సినిమా తర్వాత జూనియర్ నటిస్తున్నచిత్రం, ''శ్రీమంతుడు'' తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్య మీనన్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 
 
అంతేకాదు ఈ చిత్రంలో సాయికుమార్, సుహాసిని తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఎపుడెపుడాని అందరూ ఎదురుచూస్తున్న సినిమా‌కు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్లు డేట్‌లను యూనిట్ సభ్యులు ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 20వ తేదీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు డిసైడ్ అయ్యారు. 
 
అంతేకాకుండా జనతా గ్యారేజ్ ఆడియోని జూలై 15న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ చిత్రాన్ని ఎలాగైనా ఆగస్టు 12న కృష్ణ పుష్కరాల కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ ప్రారంభించిన మొదటి రోజే రిలీజ్ డేట్ ప్రకటించేసి అందరినీ అబ్బురపరచిన ఎన్టీఆర్ ''జనతా గ్యారేజ్'' టీమ్.. మునుముందు ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాల్సింద్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20వేల గుండె శస్త్రచికిత్సలు చేసిన విజయ్‌ దీక్షిత్‌‌కు సన్మానం.. చిరంజీవి హాజరు