Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప‌వ‌న్ - క్రిష్ మూవీ నిజ‌మేనా?

ప‌వ‌న్ - క్రిష్ మూవీ నిజ‌మేనా?
, శుక్రవారం, 1 నవంబరు 2019 (14:30 IST)
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ-ఎంట్రీ గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో బాలీవుడ్లో స‌క్స‌స్ సాధించిన‌ పింక్ మూవీని రీమేక్ చేయాల‌నుకుంటున్నారు. అలాగే డైరెక్ట‌ర్ క్రిష్, ప‌వ‌న్ కోసం ఓ క‌థ రెడీ చేసారు. ఇది జాన‌ప‌ద క‌థ అని.. ప‌వ‌న్‌కి కొత్త‌గా ఉంటుంద‌ని.. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏదో ఒక‌టి ఫైన‌ల్ చేస్తారు అని వార్త‌లు వ‌చ్చాయి.

తాజాగా వ‌చ్చిన వార్త ఏంటంటే... క్రిష్ క‌థ‌కి పవన్ ఓకే చెప్పేసాడు. ఈ  సినిమాని న‌వంబ‌ర్ 15న ప్రారంభిస్తార‌ని... ఎ.ఎం. ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

కానీ... అఫిషియ‌ల్‌గా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ రాలేదు. దీంతో అస‌లు ఈ వార్త వాస్త‌వ‌మా..?   కాదా..? అనేది ఆస‌క్తిగా మారింది. ప‌వ‌న్ స‌న్నిహితులు మాత్రం ఆయ‌న ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు అని చెబుతున్నారు. మ‌రి.. క్లారిటీ రావాలంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ మూడో సీజన్.. గీతా మాధురి సపోర్ట్ ఎవరికో తెలుసా?