హీరో హృతిక్ రోషన్, దర్శకుడు అశుతోష్ గోవార్కిర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నచిత్రం 'మొహెంజోదారో'. క్రీస్తూ పూర్వం 2600 కాలంనాటి సింధునాగరికత సమయంలో ఉన్న మొహెంజోదారో నగర నేపథ్యంలో సాగే కథ ఇది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్లుక్ని హృతిక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశాడు. అందులో హృతిక్ మాస్లుక్తో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్నందిస్తున్నాడు. యూటివి మోషన్ పిక్చర్స్, అశుతోష్ గౌరీఖర్ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్లపై నిర్మాతలు సిద్ధార్థ్ రాయ్ కపూర్, సునీత గౌరీకర్, అశుతోష్ గౌరీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
దాదాపు వందకోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.