Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ఏ మాయ చేసావే2'కి రెడీ అయిన గౌతమ్.. మళ్లీ చైతూ-సమ్మూ కలుస్తారా?

em maya chesave movie still
, శనివారం, 17 సెప్టెంబరు 2022 (21:26 IST)
టాలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అదీ కూడా చైతూ-సమ్మూల గురించి. తాజాగా, తమిళ స్టార్ హీరో శింబుతో కలిసి 'ముత్తు' అనే సినిమాను గౌతమ్ వాసుదేవన్ తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీ సెప్టెంబర్ 17న విడుదల కానుంది. దీంతో గౌతమ్ మీనన్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను తెలిపారు. ''ఓటీటీ వచ్చాక చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. ఏదో పెద్ద సినిమాలను ఓటీటీ ద్వారానే చూస్తున్నారు.
 
నిజం చెప్పాలంటే మూవీకి భాషతో సంబంధం లేదు. తాను శింబుతో కలిసి 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' అనే టైటిల్‌తో ఉన్న ఈ సినిమాను కథ డిమాండ్ చేయడంతో రెండు పార్టులుగా విడుదల చేస్తున్నామన్నారు.

అలాగే "సినీ లెజెండ్  కమల్‌హాసన్‌గారితో 'రాఘవన్‌ 2', అలాగే వెంకటేష్‌గారితో 'ఘర్షణ 2' నాగచైతన్యతో కలిసి 'ఏ మాయ చేసావే2' సినిమాలను చేయాలని అనుకుంటున్నాను''. అని డైరెక్టర్ గౌతమ్ మీనన్ అన్నారు. దీంతో అభిమానులు సమంత-నాగచైతన్య మళ్లీ కలిసిపోతారా? అనే హ్యాపీలో వున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింగర్ సునీత రెండో పెళ్లి.. ఇంటర్వ్యూల్లో కన్నీళ్లు పెట్టుకుంది.. ఎందుకంటే?