Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ బాబు- మురుగ దాస్ సినిమా: ఎస్‌జే సూర్య-నదియా రొమాన్స్ అదుర్స్!

అత్తారింటికి దారేది చిత్రం ద్వారా తెలుగులో పరిచయమై అద్భుతమైన నటనను కనబరిచిన నటి నదియా. ఈ సీనియర్ నటి కోలీవుడ్ దర్శకుడితో రొమాన్స్ చేస్తుందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే... తమిళ

Advertiesment
Director
, శనివారం, 16 జులై 2016 (15:46 IST)
అత్తారింటికి దారేది చిత్రం ద్వారా తెలుగులో పరిచయమై అద్భుతమైన నటనను కనబరిచిన నటి నదియా. ఈ సీనియర్ నటి కోలీవుడ్ దర్శకుడితో రొమాన్స్ చేస్తుందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే... తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రంలో విలన్‌‌‌గా తమిళ దర్శకుడు, హీరో ఎస్ జే సూర్య నటిస్తున్నాడు. 
 
అయితే ఈయనకు జోడీగా నదియాని సెలక్ట్ చేశారు. నదియా పాత్ర ఈ చిత్రంలో కీలకంగా ఉంటుందని అలాగే సూర్యతో నదియాకు రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయని యూనిట్ సభ్యులు అంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ తరువాత నదియా వరుస సినిమాలతో సక్సెస్ బాటలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఎస్‌జే సూర్య రొమాన్స్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయని.. తప్పకుండా అమ్మడుకు ఆఫర్లు వస్తాయని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో కబాలి క్రేజ్: 400 థియేటర్లలో ఫస్ట్ షో రిలీజ్..!