Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టెన్షన్‌లో దిల్ రాజు, ఇంతకీ ఏమైంది?

టెన్షన్‌లో దిల్ రాజు, ఇంతకీ ఏమైంది?
, శనివారం, 18 ఏప్రియల్ 2020 (21:47 IST)
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అనగానే ఠక్కున గుర్తుకువచ్చే పేరు దిల్ రాజు. దిల్ సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో భారీ చిత్రాలు నిర్మించారు. ఎన్నో విజయాలు సాధించారు. అయితే... ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. 
 
ఇంతకీ మేటర్ ఏంటంటే ఈ సినిమాలో నటించడం కోసం పవన్ కళ్యాణ్‌కి భారీగా 50 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.
 
 వకీల్ సాబ్ చిత్రాన్ని మే 15న రిలీజ్ చేయాలి అనుకున్నారు. షూటింగ్ బాగానే జరుగుతుంది. అనుకున్న ప్లాన్ ప్రకారం సమ్మర్లో వకీల్ సాబ్ రిలీజ్ అనుకుంటుంటే.. ఇంతలో కరోనా వచ్చి పడింది. అంతే.. అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. సమ్మర్ సీజన్ కాస్త పోయింది. 
 
ఏప్రిల్ 30 తర్వాత లాక్ డౌన్ ఎత్తేసినా మే నెల నుంచి థియేటర్స్ ఒపెన్ చేస్తారా లేదా అనేది అనుమానమే. ఒకవేళ థియేటర్స్ ఓపెన్ చేసినా జనాలు వస్తారో రారో. అందుచేత వకీల్ సాబ్ ఇప్పట్లో థియేటర్లోకి రాదు. ఆగష్టులో థియేటర్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
 
 దీంతో దిల్ రాజు బాగా టెన్షన్ పడుతున్నారని టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆగష్టు వరకు సినిమాని రిలీజ్ చేయకుండా ఉంటే.. ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి తీసుకువచ్చిన అమౌంట్‌కి ఇంట్రస్ట్‌లు పెరిగిపోతాయి. దీంతో ఏం చేయాలో తెలియక దిల్ రాజు బాగా టెన్షన్ పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. అదీ మేటరు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగార్జున వర్సెస్ మహేష్ బాబు, అసలు వీరిద్దరి మధ్య ఏమైంది?