Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నెల్ ఇస్తున్న చిరు.. మరో మల్టీస్టారర్ మూవీకి ఓకే?!

వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నెల్ ఇస్తున్న చిరు.. మరో మల్టీస్టారర్ మూవీకి ఓకే?!
, ఆదివారం, 10 మే 2020 (13:00 IST)
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. 'ఖైదీ నంబర్ 150' వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇపుడు వరుసబెట్టి చిత్రాలు చేస్తోంది. ముఖ్యంగా, ఖైదీ నంబర్ 150 తర్వాత సైరా నరసింహా రెడ్డి, ఇపుడు ఆచార్య ప్రాజెక్టుకు కరోనా కారణంగా బ్రేక్ పడింది. 
 
ఇదిలావుండగానే, మలయాల సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌ను తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం తర్వాత మరో ప్రాజెక్టుకు చిరంజీవి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును దర్శకుడు బాబీ పట్టాలెక్కించనున్నాడు. అయితే, ఇది మల్టీస్టారర్ మూవీ. ఇందులో మరో హీరోగా దగ్గుబాటి రానా నటించనున్నారనే  వార్తలు వస్తున్నాయి. 
 
ఇదే అంశంపై ఇటీవల డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ, తాను చిరంజీవితో సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. డైరెక్ట‌ర్ బాబీ త‌న‌ను క‌లిసి క‌థ కూడా చెప్పాడ‌ని చిరు తెలిపారు. ఇక మిగిలిన విషయాలు వెల్లడికావాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూజా హెగ్డే కోసం క్యూ కడుతున్న టాలీవుడ్ హీరోలు!