Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ హీరోయిన్ కళ్లు చూసి ఫ్లాటైపోయిన డైరెక్టర్... తక్షణం బుక్ చేసిన హీరో!

అనుపమ పరమేశ్వరన్. కేరళ నుంచి దిగుమతి అయిన హీరోయిన్. తన అందచందాలతో చిత్ర పరిశ్రమను ఇట్టే ఆకర్షించింది. ప్రతి ఒక్కరినీ మంత్రముగ్దులను చేస్తోంది. తాజాగా ఈమె కళ్లు చూసి ఓ డైరక్టర్ ఫాటైపోయాడట. ఆ మరుక్షణమే

ఆ హీరోయిన్ కళ్లు చూసి ఫ్లాటైపోయిన డైరెక్టర్... తక్షణం బుక్ చేసిన హీరో!
, ఆదివారం, 18 డిశెంబరు 2016 (16:41 IST)
అనుపమ పరమేశ్వరన్. కేరళ నుంచి దిగుమతి అయిన హీరోయిన్. తన అందచందాలతో చిత్ర పరిశ్రమను ఇట్టే ఆకర్షించింది. ప్రతి ఒక్కరినీ మంత్రముగ్దులను చేస్తోంది. తాజాగా ఈమె కళ్లు చూసి ఓ డైరక్టర్ ఫాటైపోయాడట. ఆ మరుక్షణమే ఈ కేరళ కుట్టినీ ఆ హీరో బుక్ చేసేశాడట. ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరో కాదు.. సుకుమార్. హీరో రామ్ చరణ్. 
 
చెర్రీ - సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్ ఎవరనే అంశంపై మొన్నటివరకు చాలా చర్చ సాగింది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా మరోసారి రకుల్ ప్రీత్ సింగ్‌ను తీసుకుంటారని అంతా అనుకున్నారు. 
 
మరోవైపు రాశిఖన్నా పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. ఆ అవకాశాన్ని అనుపమ పరమేశ్వరన్ ఎగరేసుకుపోయిందని టాక్. ఇప్పటికే "అ.. ఆ..." సినిమాతో పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం 'శతమానంభవతి' అనే సినిమాలో శర్వానంద్ సరసన నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఇది విడుదలకానుంది.
 
ఈ పరిస్థితుల్లో పల్లెటూరి అమ్మాయి లుక్స్ కావాలంటున్న సుకుమార్… అనుపమ కళ్లుచూసి ఫ్లాట్ అయిపోయాడట. వెంటనే తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడట. ఏ క్యారెక్టర్‌కైనా ఇట్టే సెట్ అయిపోయే ఈ మలయాళ బ్యూటీ.. సుకుమార్ చెప్పిన స్టోరీలైన్‌కు ఫిదా అయిపోయింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇలా సుకుమార్-అనుపమ మధ్య ఓ అండర్ స్టాండింగ్ వచ్చేసింది. అయితే ఈ ఎంట్రీకి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిత్రమా.. రణమా? శరణమా? : చిరంజీవికి సవాల్ విసురుతున్న బాలకృష్ణ