Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలయ్యతో పాటు రాజశేఖర్‌తో చిందులేయనున్న సన్నీలియోన్.. ముంబై ఫిలిమ్ సిటీలో?

బాలయ్య శాతకర్ణికి తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ వుంటుందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా సన్నీలియోన్‌తో నటు

బాలయ్యతో పాటు రాజశేఖర్‌తో చిందులేయనున్న సన్నీలియోన్.. ముంబై ఫిలిమ్ సిటీలో?
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (10:59 IST)
బాలయ్య శాతకర్ణికి తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ వుంటుందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా సన్నీలియోన్‌తో నటుడు రాజశేఖర్ కూడా చిందులేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. "గరుడ వేగ" సినిమాతో మరోసారి రాజశేఖర్‌ పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 
 
చందమామ కథలు, గుంటూరు టాకీస్‌ చిత్రాలతో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘కరెంటు తీగ’లో నటించిన సన్నీ లియోన్‌ ‘గరుడ వేగ’లో ఓ ప్రత్యేక పాటలో మెరవనున్నారు. ఈ సినిమాలో సన్నీలియోన్ పాట కోసం ముంబై ఫిలింసిటీలో భారీ సెట్ వేశారు. ప్రముఖ బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ విష్ణుదేవా ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చనున్నారు. ఈ సినిమా ఈ స్పెషల్ సాంగ్ హైలైట్‌గా నిలుస్తుందని సినీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశవ్యాప్తంగా 1000 ధియేటర్లలో బాహుబలి ది బిగినింగ్: నేడే చూడండి