Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిస్ ఇండియా ఎక్స్ పోజింగ్ కంటే మించిన పోజింగేమీ కాదు... పార్వతి

మిస్ ఇండియా ఎక్స్ పోజింగ్ కంటే మించిన పోజింగేమీ కాదు... పార్వతి
, సోమవారం, 16 జులై 2012 (12:19 IST)
ప్రపంచ సుందరిగా కిరీటం గెలిచిన భామ పార్వతీ ఒమనకుట్టన్‌. డేవిడ్‌ బిల్లా చిత్రంతో తమిళం, తెలుగువారికి పరిచయమైంది. "చిన్నప్పుడే రకరకాల ప్లాన్లు వేసుకున్నాను. పైలట్‌ కోసం ప్రయత్నాలు చేశాను. కానీ స్నేహితులంతా... నువ్వు ఎంతో అందంగా ఉంటావు. మోడల్‌గా ట్రై చేయి అనేవారు. అది బాగా పనిచేసింది. ఓసారి అనుకోకుండా టీవీలో మిస్సిండియా పోటీని చూశా. దాంతో ఆ రంగంపై ఆసక్తి కల్గింది. 

ఇంట్లో చెబితే చదువు కానీయ్‌ అన్నారు. నాన్న ముంబైలో తాజ్‌ హోటల్‌ మేనేజర్‌. డిగ్రీలో ఉండగా డాన్స్‌ షోలు చేశాను. డేవిడ్‌ బిల్లాలో అవకాశం బాగా పేరు తెచ్చింది. గ్లామర్‌గా నటించరా అని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు. ఎక్స్‌పోజింగ్‌ విషయంలో చాలామంది ఇప్పటికే అడుతున్నారు.

మిస్‌ ఇండియాలో పాల్గొనేటప్పుడు వేసుకునే డ్రెస్‌ కంటే ఎక్స్‌పోజింగ్‌ ఏముంటుంది? అదయినా ఆ కాసేపే. సినిమా కూడా అంతే. కాకపోతే థియేటర్లలో సినిమా రన్నింగ్‌ వల్ల ఎక్కువగా చూపినట్లుంటుంద"ని చలాకీగా చెబుతోంది. తనకు తెలుగులో మహేష్‌, నాగార్జున, తమన్నా, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ నటన అంటే ఇష్టమని చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu