Publish Date: Sat, 26 Jul 2014 (21:19 IST)
Updated Date: Sat, 26 Jul 2014 (21:20 IST)
శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఆగడు'. మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫిలింసిటీలో చివరి షెడ్యూల్ జరుగుతుంది. అక్కడ వేసిన సెట్ను చూడడానికి రామోజీరావు స్వయంగా రావడంతో తను పట్టరాని ఆనందంలో ఉండిపోయాడు.
ఉబ్బితబ్బిబ్యయి పెద్దాయన ఆశీస్సులు అందుకున్నానని శ్రీనువైట్ల నేడు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. గతంలో ఉషాకిరణ్ మూవీస్తో 'ఆనందం' అనే చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. గతంలో కూడా 'బాహుబలి' సినిమా షూటింగ్లోనూ రామోజీరావుగారు అక్కడకు వచ్చి వారి సెట్కు ఆకర్షితులయ్యారు.