Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అజ్మీర్ దర్గాను సందర్శించిన మహేష్ బాబు : 1,400 స్క్రీన్స్‌లో ఆగడు!

అజ్మీర్ దర్గాను సందర్శించిన మహేష్ బాబు : 1,400 స్క్రీన్స్‌లో ఆగడు!
, గురువారం, 18 సెప్టెంబరు 2014 (12:27 IST)
కథానాయకుడు మహేష్‌బాబు అజ్మీర్ దర్గాని సందర్శించారు. అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చస్తీ దగ్గర మహేష్‌బాబు ప్రార్థనలు నిర్వహించారు. మహేష్‌బాబు హీరోగా నటించగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన 'ఆగడు' సినిమా శుక్రవారం నాడు విడుదల అవుతున్న నేపథ్యంలో మహేష్‌బాబు అజ్మీర్ దర్గాని దర్శించుకున్నారు.
 
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 'ఆగడు' సినిమా టాలీవుడ్‌లో కొత్త రికార్డులు సాధించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ఆడియోలకు మాంచి స్పందన వచ్చిన నేపథ్యంలో.. తప్పకుండా అందగాడు సినిమా రికార్డులు సృష్టించనుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వచ్చేసింది. 
 
ఆగడు సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 1,400 స్క్రీన్లలో ఆగడు ప్రదర్శించబోతున్నాడు. దీంతో ఆంధ్రా బాక్సాఫీసు బద్ధలు కావడం ఖాయమని సినీ పండితులు అంటున్నారు. 
 
దేశంలో 1,160 స్క్రీన్లు, అమెరికా 159 స్క్రీన్లు, తమిళనాడులో 55 స్క్రీన్లు, కర్ణాటకలో 80, ముంబైలో 65 ఆగడు షో ఉంటుందని ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ ట్రాకర్ శ్రీధర్ పిళ్లై ట్వీట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu