Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళ దృశ్యంకు కష్టాలు తప్పవా? కమల్ ఏం చేస్తారు?

Advertiesment
Drushyam in Trouble Again
, సోమవారం, 28 జులై 2014 (13:20 IST)
తమిళ దృశ్యం మూవీకి కష్టాలు తప్పేలా లేవు. తెలుగులో హిట్ అయిన "దృశ్యం" తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీదేవి నటిస్తోంది. కన్నడ, మలయాళంతో పాటు తెలుగులోనూ హిట్ అయిన ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. ఆగస్టు నుంచి షూటింగ్ మొదలు పెట్టాలనుకున్న ఈ సినిమాకు కోర్టుతో కష్టాలు తప్పేలాలేవు.
 
'దృశ్యం' ఒరిజినల్ మలయాళ మాతృకలో తాను కొన్న జపాన్ చిత్ర సన్నివేశాలున్నాయంటూ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ ఆరోపిస్తున్నారు. తను రైట్స్ కొన్న చిత్రంలోని సీన్లు ఇందులో కాపీ చేశారంటూ మలయాళ 'దృశ్యం'  సినిమా రచయితకు, నిర్మాతకు లీగల్ నోటీసులు పంపారు. ఇంకా ఈ చిత్ర కథ రాసిన మలయాళ రచయిత సతీష్ పాల్ కూడా కోర్టుకెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు స్పందించిన ఎర్నాకుళం కోర్టు తమిళ వెర్షన్ దృశ్యం షూటింగ్ నిలపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.  

Share this Story:

Follow Webdunia telugu