Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వ పథకాల చిత్రం కాదు: అరుణ్ ప్రసాద్

Advertiesment
వినోదం వెండితెర కథనాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి  70 శాతం కమర్షియల్ చిత్రం
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తోన్న మూకీ చితం... ఇప్పటికే 70 శాతం పూర్తయింది. ఇదేదో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రచార చిత్రమనే అపోహ కొందరిలో ఉందని, అది సరికాదని, ఇది నూటికి నూరు పాళ్లు కమర్షియల్ చిత్రమని దర్శకుడు అరుణ్ ప్రసాద్ అన్నారు. ఈ సినిమా టైటిల్‌ను త్వరలో వెల్లడిస్తామని అరుణ్ వెల్లడించారు.

విసు ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సి. సి. రెడ్డి సమర్పణలో డా. వై. సోనియా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రోగ్రెస్ గురించి చిత్ర సమర్పకులు సి.సి. రెడ్డి మాట్లాడుతూ... వైఎస్సార్ ఈ చిత్రంలో తన నిజజీవిత పాత్రనే పోషిస్తున్నారని, ఆయనది ఈ సినిమాలో అతిథి పాత్ర కాదని స్పష్టం చేశారు. పూర్తి నిడివిగల పాత్రలో వైస్సార్ ఆద్యంతం కన్పిస్తారని తెలిపారు.

డా. బ్రహ్మానందం గిరిజన గూడెం ప్రతినిధిగా కన్పిస్తారని, ఈ సినిమాలో హాస్యానికి కన్నీళ్లు వస్తాయని, సెంటిమెంట్‌కు కంటతడిపెట్టిస్తుందని తెలిపారు. పుష్పకవిమానం తర్వాత వస్తోన్న పూర్తి నిడివి కమర్షియల్ మూకీ చిత్రమిదని, ఇదొక ప్రయోజనాత్మక కమర్షియల్ చిత్రమని సి.సి. రెడ్డి వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu