Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రత్యేకతను నిరూపించుకోవాలి: వైఎస్సార్

Advertiesment
వినోదం వెండితెర కథనాలు ప్రత్యేకత వైఎస్సార్ నిరూపించుకోవాలి న్యూస్ ఎంటర్టైన్మెంట్ భక్తి దేశం రాష్ట్రం ప్రగతి పథం
ఇప్పటికే చాలా ఛానల్స్ వచ్చాయి. న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, భక్తి తదితర అంశాలతో వేటికవి ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. దేశం, రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఛానెల్స్ గ్రామాల్లోని ప్రతిభను బయటకు తేవాలని, అవి అందరికీ స్ఫూర్తినిచ్చేవిధంగా ఉండాలని సీఎం సూచించారు.

రొటీన్‌లా కాకుండా ఓ ప్రత్యేకతను నిరూపించుకునేలా ఛానెల్స్ ఉండాలని, లోకల్ టీవీ దినదినాభివృద్ధి చెందాలని వైఎస్సార్ అన్నారు. లోకల్ టీవీ (నాఊరు, నాటీవీ) క్యాప్షన్‌తో ఏర్పాటు చేసిన టీవీ ఛానెల్‌ను వైఎస్సార్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా లోకల్ టీవీ ఛైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... పల్లెపల్లెలో వినోదకార్యక్రమాలు, విశేషాలు కళ్లముందుంచాలని చేసే ప్రయత్నమే లోకల్ టీవీ ఆవిర్భావమని, ప్రగతి పథంవైపు నడిపించేలా ఈ టీవీ కార్యక్రమాలుంటాయని చెప్పారు.

ఏషియా నెట్ తెలుగు ఛానెల్ "సితార" నేటి నుంచి (గురువారం) నుంచి ప్రారంభం కానుందని సి.ఇ.ఓ విజయ్ బాబు వెల్లడించారు. త్వరలో న్యూస్ ఛానెల్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ హెచ్.పి.ఓ. కవితా ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరక్టర్ స్వప్నాదత్, విష్ణువర్ఘన్ ఇంటూరి (సి.ఇ.ఓ) జయప్రద తదితరులు హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu