సంచనాలకు మారు పేరైన బాలీవుడ్ దర్శకుడు రామ్గోపాల్ వర్మ పెనుగొండ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మహిళా నేత పరిటాల సునీతతో సమావేశమయ్యారు. అంతకుముందు దుండగుల చేతుల్లో ప్రాణాలు అర్పించిన ఆమె భర్త పరిటాల రవీంద్ర సమాధిని సందర్శించారు.
రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సూరి, పరిటాల కుటుంబాల మధ్య ఉన్నవర్గపోరు ఆధారంగా చిత్రాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. 'రక్త చరిత్ర' పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించాలని రామ్గోపాల వర్మ ప్లాన్ చేస్తున్నారు.