Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ విమోచన దినోత్సవం... కాషాయ తలపాగాలతో మహిళా కార్యకర్తలు

Advertiesment
bjp
, గురువారం, 15 సెప్టెంబరు 2022 (14:37 IST)
bjp
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఇవాళ బీజేపీ చేపట్టిన బైక్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ నిర్వహిస్తోంది. 
 
భాగ్యలక్ష్మీ ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ర్యాలీలో పాల్గొన్నారు. ఇక చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి పరేడ్ గ్రౌండ్స్ మీదుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాల రెపరెపల మధ్య, కాషాయ తలపాగాలు ధరించిన బీజేపీ మహిళా కార్యకర్తలంతా ర్యాలీలో పాల్గొన్నారు.
 
చార్మినార్ నుంచి పరేడ్‌ గ్రౌండ్‌ వరకూ బౌక్‌లు దౌడు తీశాయి. సెప్టెంబర్‌ 17 సందర్భంగా హైదరాబాద్‌లో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు సెక్యూరిటీ టైట్‌ చేశారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ సర్కార్‌ జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతోంది. ఈ పోటా పోటీ కార్యక్రమాలతో ఎక్కడా ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘నువ్వు దళితుడివే అయితే, దళితులకే పుడితే’... ఏపీ అసెంబ్లీలో మంత్రి మేరుగు నాగార్జున వ్యాఖ్యలు