Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గతేడాది మీరిచ్చిన వాగ్దానం మరిచిపోయారు.. : రంగం స్వర్ణలత

Advertiesment
rangam swarnalatha
, సోమవారం, 10 జులై 2023 (11:21 IST)
ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల వేడుకల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజల పూజలు సంతోషంగా అందుకున్నానని చెప్పారు. గతేడాది మీరు ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారన్నారు. కావాల్సిన బలాన్నిచ్చానని.. మీ వెంటా ఉంటానని చెప్పారు. ఆలస్యమైనా వర్షాలు తప్పకుండా వస్తాయని, భయపడొద్దని చెప్పారు. 
 
ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దు. ఐదు వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలి. ఏ పూజలు చేసినా సంతోషంగా ఆందుకుంటున్నా అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కాగా, రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యవాణి వినేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు తరలివచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరాదిన వర్ష బీభత్సం.. వరద ప్రవాహానికి కొట్టుకుని పోయిన వంతెన