Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నల్గొండలో పెను విషాదం - సిలిండర్ పేలి ఇద్దరి మృతి

bomb blast
, సోమవారం, 26 జూన్ 2023 (16:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కేంద్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఏసీ సిలిండర్ పేలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ పట్టణంలోని బర్కత్‌పుర కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న న్యూస్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజీ ఏసీ గ్యాస్‌ సిలిండర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో సిలిండర్ ఉన్నట్టుండి పేలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో కోల్డ్ స్టోరేజీ ఓనర్ షేక్ కలీం, అందులో పని చేసే వ్యక్తి సాజిద్ మృతి చెందారు. పేలుడు ధాటికి వారి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమయంలో కోల్డ్‌స్టోరేజ్ పని చేస్తున్న మరో నలుగురు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

37 యేళ్ల క్రితం నాటి కేసులో నిర్దోషిగా నవాజ్ షరీఫ్