Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇకపై నా దృష్టంతా పాలేరు అసెంబ్లీపైనే ఉంటుంది : టీ మంత్రి తుమ్మల

Advertiesment
tummala nageswara rao
, శుక్రవారం, 20 మే 2016 (15:05 IST)
ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వర రావు విజయం సాధించారు. ఈయన ఆ రాష్ట్ర మంత్రిగా ఉంటూ బరిలోకి దిగి రికార్డు స్థాయి మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. 
 
ఈ ఫలితం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత పాలకులు పాలేరుకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఇకపై నా ఫోకస్ అంతా పాలేరు పైనే ఉంటుందన్నారు. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడే పాలేరులో అభివృద్ధి జరిగిందని ఆ తర్వాత పాలేరును పట్టించుకున్నవారే లేరని మండిపడ్డారు. 
 
ఎన్నికల్లో గెలిపించన పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఖమ్మం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే నా లక్ష్యమని ఆయన తెలిపారు. మౌలిక వసతుల కల్పనతో పాటు మానవ వనరుల అభివృద్ధే నాధ్యేయమని మంత్రి తుమ్మల తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళ ముఖ్యమంత్రిగా పినరాయి విజయన్‌.. అచ్యుతానందన్‌కు మొండిచేయి!