Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ టీడీపీ పగ్గాలు బక్కనికి... చంద్రబాబు నిర్ణయం

తెలంగాణ టీడీపీ పగ్గాలు బక్కనికి... చంద్రబాబు నిర్ణయం
, సోమవారం, 19 జులై 2021 (15:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి నూతన అధ్యక్షుడుగా బక్కని నరసింహులు నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకం తర్వాత బక్కని నరసింహులు మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీ  బలోపేతం కోసం‌ కృషి చేస్తానని ప్రకటించారు. 
 
టీడీపీలో మాత్రమే దళితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి ఇవ్వకుండా సీఎం కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. 
 
చంద్రబాబు కష్టడి హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేస్తే కేసీఆర్, జగన్‌లు అనుభవిస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు నేతలు పార్టీని వీడినా... తెలంగాణలో పార్టీకి  ప్రజల ఆదరణ ఉందన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చంద్రబాబుదే తుది నిర్ణయమన్నారు. 
 
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు.  టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈయన స్థానంలో బక్కని నరసింహులును నియమించారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన బక్కనికి 1994-99లో షాద్‌నగర్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేక హోదాపై చర్చకు విజయసాయి నోటీసు