Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాలనీలోకే బస్సు : తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం

కాలనీలోకే బస్సు : తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం
, బుధవారం, 6 అక్టోబరు 2021 (12:42 IST)
దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది. ఒకే ప్రాంతం, లేదంటే ఒకే కాలనీ నుంచి ఊర్లకు వెళ్లే ప్రయాణికులు 30 మంది, అంతకుమించి ఉంటే సమీపంలోని డిపో నుంచి బస్సును బుక్ చేసుకోచ్చు.
 
అలా బుక్ చేసుకునే బస్సులు నేరుగా కాలనీ లేదా ప్రాంతానికి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటుందని ఆర్టీసీ తెలిపింది. ఈ సదుపాయం బుధవారం నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌లు వెల్లడించారు. 
 
అలాగే, దసరా పండుగను పురస్కరించుకుని నడిపే ప్రత్యేక బస్సులు, వాటి ధరలు, సమయం, ఇతర వివరాల కోసం ఆయా బస్ స్టేషన్లను సంప్రదించాలని సూచించారు. 
 
ఎంజీబీఎస్‌ను 99592 26257, జూబ్లీ బస్ స్టేషన్‌ను 99592 26264, రెతిఫైల్ బస్‌స్టేషన్‌ను 99592 26154, కోఠి బస్‌స్టేషన్‌ను 99592 26160 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. దసరా నేపథ్యంలో నగరం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ ఎయిర్ పోర్ట్ లో... ఆమె బ్యాగులో బులెట్లు... ఎక్క‌డివి?