Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాహుల్ టూర్లో ఇబ్బంది పడ్డ సీనియర్ కాంగ్రెస్ నాయకులు

రాహుల్ గాంధీ తెలంగాణాలో జరిపిన రెండు రోజుల పర్యటన కాంగ్రెస్ క్యాడర్‌కు ఉత్సాహాన్ని నింపింది. అయితే కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం రాహుల్ టూర్లో ఇబ్బంది పడ్డట్టు సమాచారం. హోటల్ హరిత ప్లాజాలో రాహుల్‌తో ఎడిటర్స్ సమావేశం ఏర్పాటు చేశారు.

రాహుల్ టూర్లో ఇబ్బంది పడ్డ సీనియర్ కాంగ్రెస్ నాయకులు
, బుధవారం, 15 ఆగస్టు 2018 (17:40 IST)
రాహుల్ గాంధీ తెలంగాణాలో జరిపిన రెండు రోజుల పర్యటన కాంగ్రెస్ క్యాడర్‌కు ఉత్సాహాన్ని నింపింది. అయితే కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం రాహుల్ టూర్లో ఇబ్బంది పడ్డట్టు సమాచారం. హోటల్ హరిత ప్లాజాలో రాహుల్‌తో ఎడిటర్స్ సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా కొంతమంది పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే పత్రికలు టీవీ చానెల్స్ ప్రతినిధులు, ఫార్టీనాయకుల పేర్లను పిసిసి ఎస్పీజీ పంపించింది. అయితే ఎస్పీజీకి పంపిన జాబితాలో జానారెడ్డి, షబ్బీర్ ఆలీ పేర్లు లేకపోవడంతో అలిగి ఇద్దరూ ప్లాజా నుంచి బయటికి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు.
 
ఇది గమనించిన మరో నేత ఇద్దరినీ బతిమాలి లోపలికి తీసుకొచ్చి కూర్చో పెట్టారు. లోపల కూడా వాళ్లిద్దరూ మౌనంగానే కూచున్నారు. మరోవైపు రాహుల్ గాంధీతో సీనియర్ల మీటింగ్ జరిగే సమయంలో రేవంత్ రెడ్డి లోపలికి వెళ్లకుండా అనుమతి నిరాకరించారు. ఇక రాహుల్‌తో సీనియర్ల మీటింగ్‌కు తనకు కూడా అనుమతి లేదనడంతో సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టుకున్నట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ప్రజలు నాలుగు రాజధానుల్లో స్వాతంత్ర్య వేడుకలు... ఆనందపడాలా? బాధపడాలా?