Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో ఒడిస్సా తరహా ఘటన.. తోపుడు బండిలో భార్య మృతదేహం.. 60 కిలోమీటర్లు?

ఒడిస్సా ఘటన తెలంగాణలో పునరావృతమైంది. ఆంబులెన్స్‌లో భార్య శవాన్ని తీసుకెళ్లలేని ఓ వ్యక్తి యూపీలో తన భుజంపై శవాన్ని వేసుకుని కిలోమీటర్ల మేర నడిచిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన నేపథ్యంలో.. తాజాగా

తెలంగాణలో ఒడిస్సా తరహా ఘటన.. తోపుడు బండిలో భార్య మృతదేహం.. 60 కిలోమీటర్లు?
, సోమవారం, 7 నవంబరు 2016 (13:39 IST)
ఒడిస్సా ఘటన తెలంగాణలో పునరావృతమైంది. ఆంబులెన్స్‌లో భార్య శవాన్ని తీసుకెళ్లలేని ఓ వ్యక్తి యూపీలో తన భుజంపై శవాన్ని వేసుకుని కిలోమీటర్ల మేర నడిచిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన నేపథ్యంలో.. తాజాగా భార్య గుండెపోటుతో మరణించడంతో ఆమె భౌతిక కాయాన్ని ఆ వృద్ధ భర్త తోపుడు బండిలో ఉంచి 60కిలోమీటర్ల మేర తోసుకొచ్చిన ఘటన తెలంగాణ, మాయ్‌గోడ్ గ్రామంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. తెలంగాణ, మాయ్‌గోడ్ గ్రామానికి చెందిన దంపతులు రాములు-కవిత పెద్దరోగంతో బాధపడేవారు. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఫలితం మాత్రం శూన్యం. ఈ నేపథ్యంలో శుక్రవారం లింగాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భిక్షమెత్తుతుండగా.. కవిత గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో తన భార్య మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరపాలని రాములు నిర్ణయించుకున్నాడు. 
 
అంతే భార్య మృతేదేహాన్ని ఆంబులెన్స్‌లో తీసుకెళ్లేందుకు డబ్బుల్లేక.. తోపుడు బండిలో భార్య మృతదేహాన్ని వుంచి తోసుకెళ్లాడు. 60 కిలోమీటర్ల భార్య మృతదేహాన్ని ఆ వృద్ధ రాములు తోసుకొచ్చాడు. ఈ క్రమంలో దారికూడా తప్పాడు. ఆపై కవిత మృతదేహాన్ని తోసుకెళ్లేందుకు రాములు ఒంటిలో శక్తి లేకపోవడంతో నడిరోడ్డుపై కూర్చుని.. ఏడుపు ఆపుకోలేకపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాములకు ఆర్థిక సాయం చేసి సొంతూరికి పంపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆత్మహత్య చేసుకునేంత వేధింపులా... యజమాని అంత క్రూరుడా...? పసిమొగ్గలను అనాధలను చేసిన 'అమ్మ'