Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డిగ్రీ విద్యార్థిని ప్రాణం తీసిన యాపిల్ ముక్క

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో విషాద సంఘటన ఒకటి జరిగింది. చిన్నపాటి యాపిల్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో డిగ్రీ విద్యార్థిని మృతి చెందింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

డిగ్రీ విద్యార్థిని ప్రాణం తీసిన యాపిల్ ముక్క
, సోమవారం, 18 సెప్టెంబరు 2017 (12:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో విషాద సంఘటన ఒకటి జరిగింది. చిన్నపాటి యాపిల్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో డిగ్రీ విద్యార్థిని మృతి చెందింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరుకు చెందిన జానపద కళాకారుడు ఏ.శంకర్‌ అనే వ్యక్తి నాలుగో కుమార్తె ఝాన్సీ సుల్తానాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. 
 
ఆదివారం సెలవుదినం కావడంతో సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉన్న యాపిల్‌ తీసి కట్ చేసి ఆరగిస్తుండగా, ప్రమాదవశాత్తు ఓ ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో ఆ విద్యార్థినికి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైంది. 
 
వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించే లోపే ఝాన్సీ కన్నుమూసింది. అకారణంగా బిడ్డ మరణించడంతో కుటుంబసభ్యులు హతాశులయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆటో ఓనర్‌కు మత్తుమందిచ్చి రేప్ చేశాడు.. దాన్నీ వీడియో తీసి భర్తకు పంపాడు..