Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొరుగు రాష్ట్రాల బిర్యానీతో హైదరాబాదీ బిర్యానీ రుచికి సరితూగదు: షబ్బీర్ అలీ

పొరుగు రాష్ట్రాల బిర్యానీతో హైదరాబాదీ బిర్యానీ రుచికి సరితూగదని తెలంగాణా శాసనమండలిలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. సిటీ బిర్యానీ మంటి టేస్టుగా ఉండాలంటే ఇక్కడి గొర్రెలో లేదా తెలంగాణా ప్ర

పొరుగు రాష్ట్రాల బిర్యానీతో హైదరాబాదీ బిర్యానీ రుచికి సరితూగదు: షబ్బీర్ అలీ
, ఆదివారం, 19 మార్చి 2017 (15:02 IST)
పొరుగు రాష్ట్రాల బిర్యానీతో హైదరాబాదీ బిర్యానీ రుచికి సరితూగదని తెలంగాణా శాసనమండలిలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. సిటీ బిర్యానీ మంటి టేస్టుగా ఉండాలంటే ఇక్కడి గొర్రెలో లేదా తెలంగాణా ప్రాంత గొర్రెలో లేదా హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి తెప్పించుకున్నావో అయి ఉండాలని తెలిపారు. 
 
తెలంగాణలో గొర్రెల పెంపకందారుల ప్రయోజనాల కోసం తమ సర్కారు తీసుకుంటున్న చర్యలపై మొదట మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల నుంచి సుమారు 84 లక్షల గొర్రెలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనివల్ల ఈ స్టేట్‌లోని గొల్ల కురుమలు, ఇతర గొర్రెల పెంపకందారులకు మేలు కలుగుతుందన్నారు. 
 
అయితే బయటి రాష్ట్రాల గొర్రెల మాంసం సిటీ బిర్యానీ రుచికి తగినట్టు ఉండదని షబ్బీర్ అలీ అనుమానం వ్యక్తం చేశారు. దీనికి కౌంటరిచ్చిన కేసీఆర్.. మీరు తింటున్న బిర్యానీలో మాంసం ఎక్కడి నుంచి వస్తోందో మీకు తెలుసా అని ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీ ప్రధాని, ఆదిత్య సీఎంగా ఎంపిక కావడం ఈ శతాబ్ధంలోనే పెద్ద న్యూస్!