Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ప్రభుత్వం నుంచి శశికళకు నోటీసులు... నలిపేసిన శశి

శశికళకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. నాలుగేళ్ళ జైలుశిక్ష అనుభవించేందుకు బెంగుళూరుకు శశికళ బయలుదేరే సమయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మరో నోటీసు వచ్చింది. సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్ పల్లి, రాధిక కాలనీలో శశికళ పేరిట ఒక ఇల్లు ఉండగా, ఆ ఇంటికి గత రెండేళ్

తెలంగాణ ప్రభుత్వం నుంచి శశికళకు నోటీసులు... నలిపేసిన శశి
, గురువారం, 16 ఫిబ్రవరి 2017 (21:46 IST)
శశికళకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. నాలుగేళ్ళ జైలుశిక్ష అనుభవించేందుకు బెంగుళూరుకు శశికళ బయలుదేరే సమయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మరో నోటీసు వచ్చింది. సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్ పల్లి, రాధిక కాలనీలో శశికళ పేరిట ఒక ఇల్లు ఉండగా, ఆ ఇంటికి గత రెండేళ్ళ నుంచి ఆస్తి పన్ను చెల్లించలేదు శశికళ. 
 
పన్ను బకాయిలను నూరు శాతం వసూలు చేయాలని సంకల్పించిన కెసీఆర్ సర్కార్ ఈ మేరకు శశికళ పేరిట నోటీసులు కూడా జారీ చేశారు. ఈ ఇంటిని 1990 ప్రాంతంలో శశికళ కొనుగోలు చేశారట. అప్పట్లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కొంతకాలం జయలలిత ఇదే ఇంట్లోనే బస చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఆ తరువాత కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు ఈ ఇంటిని అద్దెకు ఇచ్చినప్పటి నుంచి వారు ఖాళీ చేసి వెళ్ళిన తరువాత గత నాలుగేళ్ళుగా ఈ ఇల్లు ఖాళీగానే ఉందని స్థానికులు చెబుతున్నారు.
 
శశికళ బెంగుళూరుకు బయలుదేరక ముందే ఆమెకు ఈ నోటీసులు అందాయట. దీంతో ఆమె మరింత ఆవేదన చెందుతూ ఆ నోటీసు నల్లిని నలిపినట్లు నలిపి అక్కడ పడేసి వెళ్లిపోయారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2017-18 ఇ-ప్రగతి పాలన, చంద్రబాబు నాయుడు ప్లాన్