Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాపురం చేసేందుకు రూ. 3 కోట్లు అడిగిందన్న భర్త, రూ.20 వేలు చెల్లించి ఇంట్లో వుండనివ్వండి...

బోడుప్పల్‌లో గత 53 రోజులుగా తనకు న్యాయం చేయాలంటూ తన భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఎదుటే దీక్ష చేస్తున్న సంగీతకు కోర్టులో ఊరట లభించింది. ఆమె భర్తకు మియాపూర్‌ ఫ్యామిలీ కోర్టు అక్షింతలు వేస్తూ తీర్పునిచ్చింది. సంగీతకు ప్రతి నెల రూ. 20 వేలు చెల్లించడమే కాక

కాపురం చేసేందుకు రూ. 3 కోట్లు అడిగిందన్న భర్త, రూ.20 వేలు చెల్లించి ఇంట్లో వుండనివ్వండి...
, గురువారం, 11 జనవరి 2018 (17:37 IST)
బోడుప్పల్‌లో గత 53 రోజులుగా తనకు న్యాయం చేయాలంటూ తన భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఎదుటే దీక్ష చేస్తున్న సంగీతకు కోర్టులో ఊరట లభించింది. ఆమె భర్తకు మియాపూర్‌ ఫ్యామిలీ కోర్టు అక్షింతలు వేస్తూ తీర్పునిచ్చింది. సంగీతకు ప్రతి నెల రూ. 20 వేలు చెల్లించడమే కాకుండా, ఆమెను గౌరవప్రదంగా ఇంట్లో వుండనివ్వాలని సూచన చేసింది. కాగా సంగీత ఇంతకుమునుపే కోర్టులో తన భర్త, అత్తమామలపై పిటీషన్ దాఖలు చేశారు. 
 
ఈ నేపధ్యంలో శ్రీనివాస్ రెడ్డి అరెస్టయి నిన్ననే బెయిల్ పైన బయటకు వచ్చాడు. తన భార్య తనతో కాపురం చేయాలంటే రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తోందనీ, తన ఆస్తినంతా ఆమెకు రాయమంటోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను, తన తల్లిదండ్రులను వేధిస్తోందంటూ రివర్స్ ఎటాక్ చేశాడు. దీనిపై సంగీత మాట్లాడుతూ... అతడు చెప్పేవన్నీ అవాస్తవాలని పేర్కొన్నారు. తను 3 కోట్లు డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే తన కేసు వాపసు తీసుకుంటానని ఆమె వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ వీరాభిమాని బండ్ల గణేష్‌పై అట్రాసిటీ కేసు