Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

road accident
, ఆదివారం, 21 మే 2023 (12:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఆర్మూర్‌ మండలం ఆలూరుకు చెందిన ఆరుగురు గజ్వేల్‌కు ఆటోలో వెళ్తున్నారు. మార్గంమధ్యలో నార్సింగి మండలం వల్లూరు అటవీ ప్రాంతానికి చేరుకునే సరికి ఆ ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ఆలూరుకు చెందిన శేఖర్‌ (45), యశ్వంత్‌ (11), గజ్వేల్‌కు చెందిన వృద్ధ దంపతులు మాణెమ్మ(60), బాలనర్సయ్య(65) అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న కవిత, అవినాశ్‌ తీవ్రంగా గాయపడ్డారు. 
 
ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ ఈ ఘటన జరిగిన తర్వాత పారిపోయాడు. సమాచారం అందుకున్న నార్సింగి ఎస్సై నర్సింగులు, చేగుంట ఎస్సై ప్రకాశ్‌గౌడ్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను రామాయపేట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖమ్మంలో దారుణం : భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త