Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు జేజెమ్మ కూడా అడ్డుకోలేరు : పోచారం

Advertiesment
pocharam srinivas reddy
, శుక్రవారం, 6 మే 2016 (11:12 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కాదు.. ఆయన జేజెమ్మ కూడా అడ్డుకోలేరని ఆ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. టీ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు తెలంగాణకు ఏమీ చేయలేదు.. విడిపోయిన తర్వాత కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. న్యాయం, ధర్మం తెలంగాణ పక్షాన ఉన్నాయని, మనకేమీ నష్టం జరుగదన్నారు. రాజకీయం పబ్బం గడుపుకోవడం కోసం ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 
 
తాము చేపట్టిన ప్రాజెక్టులను వంద మంది బాబులు, వేయి మంది జగన్‌లు వచ్చినా ఆపలేరన్నారు. నిజాంసాగర్ ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు 47 ప్రాజెక్టులు నిర్మించాయని, శ్రీరాంసాగర్ ఎగువన మహారాష్ట్ర 300 ప్రాజెక్టులు నిర్మించిందని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కామ్ : హవాలా చట్టం కింద త్యాగి వద్ద ఈడీ విచారణ