Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైల్వే స్టేష‌న్ త‌ర‌హాలో బ‌స్టాండుల్లోనూ ప్లాట్‌ఫాం టిక్కెట్

హైద‌రాబాద్ : ఎవ‌రికైనా సెండాఫ్ ఇవ్వ‌డానికి, రైల్వే స్టేష‌న్లోకి వెళ్లాలంటే ప్లాట్ ఫాం టిక్కెట్ త‌ప్ప‌నిస‌రి. ఇపుడు తెలంగాణా ప్ర‌భుత్వం ఈ ఆలోచ‌న‌ను ఆర్టీసీకి ఆపాదిస్తోంది. ఇక నుంచి తెలంగాణలోని బస్టాండ్లలోకి వెళ్లాలన్నా... ప్లాట్‌ ఫాం టికెట్ ఉండాల్సింద

రైల్వే స్టేష‌న్ త‌ర‌హాలో బ‌స్టాండుల్లోనూ ప్లాట్‌ఫాం టిక్కెట్
, శుక్రవారం, 4 నవంబరు 2016 (18:28 IST)
హైద‌రాబాద్ : ఎవ‌రికైనా సెండాఫ్ ఇవ్వ‌డానికి, రైల్వే స్టేష‌న్లోకి వెళ్లాలంటే ప్లాట్ ఫాం టిక్కెట్ త‌ప్ప‌నిస‌రి. ఇపుడు తెలంగాణా ప్ర‌భుత్వం ఈ ఆలోచ‌న‌ను ఆర్టీసీకి ఆపాదిస్తోంది. ఇక నుంచి తెలంగాణలోని బస్టాండ్లలోకి వెళ్లాలన్నా... ప్లాట్‌ ఫాం టికెట్ ఉండాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని ముఖ్యమైన బస్టాండ్లలో ప్లాట్ ఫాం టికెట్‌ను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది. 
 
అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ఆర్టీసీ ఆదాయ మార్గాల వైపు దృష్టి సారించింది. వచ్చే జనవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. టికెట్ ధర రూ.5 ఉండొచ్చని తెలుస్తోంది. మొదట ఈ విధానాన్ని హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా బస్టాండ్లలో ప్లాట్ ఫాం టికెట్లు ప్రవేశపెట్టాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మను సీసీయూ నుంచి ప్రైవేట్ రూమ్‌కు మారుస్తాం.. డిశ్చార్జ్ మాత్రం చెప్పలేం: ప్రతాప్ రెడ్డి