Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్పత్రిలో మద్యం వద్దన్నందుకు దూకేశాడు.. అంతే మృతి

Advertiesment
suicide
, గురువారం, 7 ఏప్రియల్ 2022 (16:42 IST)
ఆస్పత్రిలో మద్యం తాగవద్దని చెప్పిన పాపానికి ఓ రోగి ఆస్పత్రి భవనం నుంచి కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఉస్మానియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన నాగరాజు (22) ఈ నెల రెండవ తేదీన పురుగులమందు తాగాడు. 
 
గమనించిన భార్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ నాగరాజు చికిత్స పొందుతున్నాడు. రోజూ చుక్కేసే ఆ మనిషికి.. ఆస్పత్రిలోనూ మందేయాలనిపించింది. 
 
అంతే ఆస్పత్రికి మద్యాన్ని తీసుకురావాలని భార్యను కోరాడు. ఆస్పత్రిలో మద్యం తాగొద్దని ఆమె వారించడంతో కోపంగా ఆమెను తోసేసి అక్కడి నుంచి వెళ్లాడు. 
 
కొద్దిసేపటి నాలుగో అంతస్థు నుంచి కిందకు దూకేశాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే  మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆడ‌పిల్ల పుట్టింద‌ని ఆనందంతో హెలికాఫ్టర్లో తీసుకువ‌చ్చిన లాయ‌ర్‌