Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాదులో మహిళా టెక్కీ ఆత్మహత్య, కారణం ఏంటి?

Advertiesment
Odisha
, గురువారం, 13 ఫిబ్రవరి 2020 (15:22 IST)
హైదరాబాదులోని బేగంపేట ప్రాంతంలో వున్న సిద్ధివినాయక ఉమెన్స్ హాస్టల్లో వుంటున్న రాజ్యలక్ష్మి అనే మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 25 ఏళ్లు. ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందన్నది తెలియరాలేదు. 
 
జూబ్లిహిల్స్‌లో వున్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమె పనిచేస్తున్నది. ఒడిశా గంజాం జిల్లాలోని స్వప్నేశ్వర్ ప్రాంతానికి చెందిన ఈమె కొన్ని నెలల క్రితమే హైదరాబాద్ వచ్చింది. ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఉమెన్స్ హాస్టల్లో వుంటోంది. 
 
బుధవారం నాడు అందరూ తమ విధులకు వెళ్లిపోయినా ఆమె మాత్రం వెళ్లలేదు. రాత్రి పొద్దుపోయాక తన రూమ్మేట్ నవీన గదికి వచ్చి చూడగా రాజ్యలక్ష్మి చున్నీతో ఫ్యానుకి ఉరి వేసుకుని కనిపించింది. దీంతో విషయాన్ని పోలీసులకు చెప్పారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాకపోవడంతో ఆమె ఆత్మహత్యకు కారణం ఏంటన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంట్రాక్టు ఉద్యోగులపై సీఎం జగన్ 'రివర్స్' అస్త్రం